పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్( Pawan Kalyan, Sai Dharam Tej ) కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం చిత్రం బ్రో.సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదల హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్( Trivikram ) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.
కాగా ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.కాగా ఈ సినిమా ప్రస్తుతం భారీ వసూళ్లు అంటే 87 కోట్లతో దూసుకుపోతూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ను నిర్వహించింది.
![Telugu Pawan Kalyan, Sai Dharam Tej, Trivikram-Movie Telugu Pawan Kalyan, Sai Dharam Tej, Trivikram-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/08/sai-dharam-tej-gets-emotional-about-trivikram-pawan-kalyan-at-bro-the-avatar-success-meeta.jpg)
ఈ వేడుకలో భాగంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.జీ స్టూడియోస్తో( Zee Studios ) కలిసి ఇది నాకు మూడో సినిమా.బ్రో సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది.
ఈ సినిమాలో పవన్ మావయ్యతో నటించడం చాలా సంతోషంగా ఉంది.ఈ అవకాశం కలిగించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ( People Media Factory )థాంక్స్.
సముద్రఖని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆయన తన ప్రయాణాన్ని చిన్నగా మొదలు పెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు.
ఇక మీదట మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను అని సాయిధరమ్ తేజ్ అన్నారు.అలాగే సంగీత దర్శకుడు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లారు.
![Telugu Pawan Kalyan, Sai Dharam Tej, Trivikram-Movie Telugu Pawan Kalyan, Sai Dharam Tej, Trivikram-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/08/sai-dharam-tej-gets-emotional-about-trivikram-pawan-kalyan-at-bro-the-avatar-success-meetb.jpg)
పవన్ మావయ్య గురించి, దర్శకుడు త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే అంత అర్హత నాకు లేదు.త్రివిక్రమ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.త్రివిక్రమ్ గారు నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ అని సాయిధరమ్ తేజ్ అన్నారు.నేను యాక్సిడెంట్కు గురైన తర్వాత నా పాత్ర గురించి ఎన్నో అనుమానాలు తలెత్తాయి.అయితే ఓ దశలో మార్చి వేద్దామని అనుకొన్న సమయంలో త్రివిక్రమ్ వద్దని అన్నారు.యాక్సిడెంట్ నుంచి నేను పూర్తిగా కోలుకునే వరకు సముద్రఖని గారిని వెయిట్ చేయించారు.
బ్రో చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు అని కొచ్చారు సాయి ధరంతేజ్.