దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది.ఈ ఎలుకలు బట్టలు కొరికేయడం, ధాన్యాన్ని నాశనం చేయడం ఇలా ఇంట్లోని వస్తువులన్నీ నాశనం చేసేస్తుంటాయి.
ఇళ్లు గుల్ల చేసే ఎలుకలను ఎలా నతరిమికొట్టాలో తెలియక తెగ సత మత మవుతుంటారు.అయితే ఎలుకలు ఇంట్లో ఉండే పప్పులు, పండ్లు, కూరగాయలు తింటుండటం చూసుంటా.
అయితే అలాంటి ఎలుకలు అరటి పండును చూస్తే మాత్రం భయంతో పరుగెడతాయంట.ఇదే విషయాన్ని ఓ ప్రయోగం ద్వారా శాస్త్రజ్ఞులు నిరూపించారు.
గర్భిణీ ఎలుకల్ని ఓ ప్రయోగం కోసం ల్యాబ్ లో ఉంచగా వాటి దగ్గరున్న మగ ఎలుకలు విచిత్రంగా ప్రవర్తించాయని క్యూబెక్ లో మాంట్రియల్ లోని మెక్ గిల్ యూనివర్సిటీ స్కాలర్స్ వారు తెలిపారు.ఇదే విషయాన్ని మే 20న సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్ లో పబ్లిష్ చేశారు.
మగ ఎలుకల్లో ఆర్మోన్లలో మార్పులు, ఆడ ఎలుకల మూత్రంలో ఎన్-పెంటిల్ అసిటెట్ అనే సమ్మేళనం ఉండటం వల్ల ఈ ఫలితం వచ్చినట్లు వారు వెల్లడించారు.కాగా ఇదే సమ్మెళనం అరటిపండ్లకు కూడా ఉందని అందుకే ప్రత్యేక మైన వాసనను ఇస్తుందని శాస్త్రజ్ఞులు తెలిపారు.
గర్భిణీ ఎలుకల్ని ఓ ప్రయోగం కోసం ల్యాబ్ లో ఉంచగా వాటి దగ్గరున్న మగ ఎలుకలు విచిత్రంగా ప్రవర్తించాయని తెలిపారు.
మగ ఎలుకలు తమ జన్యుపరమైన సమర్థ్యాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి శిశుహత్యల్లో దూకుడుగా ప్రవర్తిస్తాయంట.
అందుకే ఆడ ఎలుకలు తమ సంతానాన్ని కాపాడుకోవటానికి కెమోసిగ్నలింగ్ పై ఆధారపడి శరీరాల ద్వారా రసాయన ప్రతిస్పందనలు విడుదల చేస్తాయని వెల్లడైంది.అందుకే పరిశోధకులు అరటిపండు నూనెను తీసుకుని దూది బాల్స్ లలో వేసి మగ ఎలుకల బోనులో ఉంచగా ఒత్తిడి స్థాయిని పెంచినట్లు గుర్తించారు.