రామోజీరావు ( Ramoji Rao ) ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు.రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ వ్యాపారవేత్తగా చలనచిత్ర రంగంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా రామోజీరావు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈయన స్థాపించిన రామోజీ ఫిలిం సిటీ ఆసియాలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుందని చెప్పాలి.ఇక సినీ రాజకీయ రంగాలలో కూడా రామోజీరావు పాత్ర చాలా కీలకంగా ఉంది.
అటు రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ.అవార్డులు, రివార్డులు, పురస్కారాలు అందుకుంటున్నారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియారంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు.
![Telugu Golden Throne, Nadda, Kishan Reddy, Ramoji Rao, Tollywood-Movie Telugu Golden Throne, Nadda, Kishan Reddy, Ramoji Rao, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/10/ramoji-rao-politics-golden-throne-bjp-tollywood-social-media-J-P-Nadda.jpg)
ఇలా ప్రతి ఒక్కరంగంలోని ఎంతో మంచిపట్టు ఉన్నటువంటి ఈయన గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మార్గదర్శించి చిట్ ఫండ్ కేసులో భాగంగా భారీ కుంభకోణం జరిగిందని అందులో రామోజీరావు కూడా కీలక పాత్రధారి అనే విషయం తెలిసిందే .ఈ క్రమంలోనే ఈ విషయం గురించి సిఐడి అధికారులు విచారణకు వస్తున్నారనే విషయం తెలియడంతో ఈయన ఏకంగా నడుముకు బెల్టు కట్టి హాస్పిటల్ వాతావరణాన్ని సృష్టించి ఇంట్లోనే మంచానికి పరిమితమైన సంగతి మనకు తెలిసిందే.
![Telugu Golden Throne, Nadda, Kishan Reddy, Ramoji Rao, Tollywood-Movie Telugu Golden Throne, Nadda, Kishan Reddy, Ramoji Rao, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/10/ramoji-rao-golden-throne-bjp-tollywood-social-media-J-P-Nadda.jpg)
ఇలా అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పినటువంటి రామోజీరావు తాజాగా కేంద్రమంత్రి జేపీ నడ్డాతో కలిసి చాలా చురుగ్గా భేటీలో పాల్గొన్నారు.ప్రస్తుతమెందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఈయన పట్ల సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.సిఐడి ఎంక్వయిరీ అంటేనే నడుముకు బెల్ట్ పెట్టుకుని మంచంపై ఉంటారు.అలాగే కేంద్ర మంత్రులతో భేటీ అంటే ఇలా చురుగ్గా ఉంటారు అంటూ రెండు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇలా త్వరలోనే తెలంగాణలో కూడా ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా ( J P Nadda )అలాగే కిషన్ రెడ్డి( Kishan Reddy ) కూడా రామోజీరావును కలిసి ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
![Telugu Golden Throne, Nadda, Kishan Reddy, Ramoji Rao, Tollywood-Movie Telugu Golden Throne, Nadda, Kishan Reddy, Ramoji Rao, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/10/Kishan-Reddy-politics-golden-throne-bjp-tollywood-social-media-J-P-Nadda.jpg)
ఇలా వీరి భేటీకి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే ఈ ఫోటోలలో రామోజీరావు కూర్చున్నటువంటి సింహాసనం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.అలాగే మంత్రి జేపీ ఉన్నటువంటి సోఫాలు కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి.బంగారు వర్ణంతో అచ్చం సింహాసనాలను తలపించే విధంగా ఈ సోఫాలు ఉండడంతో ఇవి నిజమేనా బంగారుతో చేయించినవేనా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
చూడటానికి ఇంత రిచ్ లుక్ లో ఉన్నటువంటి సోఫాల ఖరీదు ఎంత అనే విషయాల గురించి కూడా ఆరాతీస్తున్నారు.ఈ క్రమంలోనే రామోజీరావు ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి ఈ సోఫాల ఖరీదు ఏకంగా7 కోట్ల 23 లక్షల రూపాయలు అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు అయితే ఈ సోఫాల ఖరీదు గురించి తెలిపిన వ్యక్తి మరెవరో కాదు స్వయంగా రామోజీరావు అనుచరులే ఈ విషయాలను తెలియచేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఏది ఏమైనా అత్యంత కుబేరుడుగా పేరు సంపాదించుకున్న రామోజీరావు ఈ మాత్రం ఖర్చు చేయడంలో తప్పులేదు అంటూ కొందరు కామెంట్స్ చేయగా,అవును భారీగా స్కామ్ చేస్తే ఇలాంటివి కాక మరెలాంటివి కొంటారు అంటూ మరికొందరు కూడా కామెంట్లు చేస్తున్నారు.