టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ హీరోయిన్ లలో ఒకరైన ప్రణీత మొదట ఏం పిల్లో ఏం పిల్లడో మూవీ ద్వారా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.ఆ తరువాత ఆమెకు వరుస సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది.
ఇలా తెలుగు, తమిళం, కన్నడలో వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది ప్రణీత.ఇలా దక్షిణాదిలో ఒక మెరుపు మెరిసిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగు సినిమాలలో కొద్దికాలంపాటు కనిపించలేదు.
తెలుగు సినిమాలకు బైబై చెప్పిన ప్రణీత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.ఇకపోతే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల సమయంలో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన తెలిసిందే.
అంతేకాకుండా కరోనా సమయంలో ఎంతోమందికి అన్నదానం చేసి, దానాలు చేసి తన గొప్ప మనసుని చాటుకుంది.ప్రణీత టాలీవుడ్ హాట్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన అత్తారింటికి దారేది సినిమాతో సూపర్ హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుంది.
ఈ సినిమా తరువాత ప్రణీత కి మరింత పాపులారిటీ పెరిగింది.ఇలా ఉంటే కరోనా సమయంలో పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ప్రణీత సుభాష్ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అంతేకాకుండా ఈమె సోషల్ మీడియాలో అభిమానంతో ముచ్చటించిన ప్రతిసారి కూడా చాలామంది గుడ్ న్యూస్ ఎప్పుడు అని ప్రశ్నించారు.ఇదిలా ఉంటే తాజాగా ప్రణీత తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.తన భర్త నితిన్ రాజు పుట్టిన రోజుకు ముందు తమకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి అంటూ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది.అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ కు సంబంధించిన ఫలితాలను చూపిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.