ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు.ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించనున్న బీసీ ఆత్మగౌరవ సభకు ఆయన హాజరుకానున్నారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని చెబుతున్న బీజేపీ ఇవాళ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.కాగా ఈ సభలో బీసీ సీఎం అభ్యర్థి ఎవరనేది మోదీ ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది.
అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను కూడా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.కాగా బహిరంగ సభకు బీజేపీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలు అన్నీ కాషాయరంగుతో నిండిపోయాయి.
కాగా సాయంత్రం 5 గంటల సమయంలో మోదీ బేగంపేట విమానశ్రయానికి చేరుకోనున్నారు.అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి వెళ్లనున్నారు.
బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొననున్న మోదీ సభ ముగిసిన అనంతరం ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారని తెలుస్తోంది.