పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఆయన మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ వరుసగా రెండు సినిమాలను లైన్లో పెట్టారు.
ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్, తన తరువాత సినిమాను క్రిష్ డైరెక్షన్లో చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ రెండు సినిమాలే కాకుండా పవన్ మరో సినిమాను కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో చేయనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.దీనికి సంబంధించిన సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని, ఏ క్షణమైనా ఈ సినిమాకు సంబంధించిన వార్త రావడం ఖాయమని అంటున్నాయి సినీ వర్గాలు.
పవన్తో గతంలో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలు చేసిన పూరీ, ఈసారి ఎలాంటి కథతో పవన్ను ఇంప్రెస్ చేస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఏదేమైనా వీరి కాంబినేషన్లో కరెక్ట్ కథ పడితే, ఆ సినిమా ఇండస్ట్రీ హిట్గా మారడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.
మరి ఈ కాంబోలో సినిమా అనేది వాస్తవ రూపం దాలుస్తుందా లేక గాలివార్తగానే మిగులుతుందా అనేది చూడాలి.