సత్సంగ సదనంలో ఈనెల 5వ తేదీన సోమవారం గీత ఆద్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా :సత్సంగ సదనంలో ఈనెల 5 వ తేదీన సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5-00 గంటల వరకు గీత ఆద్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించబడుతాయని సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి తెలిపారు.సత్సంగ సదనం వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ భక్త శ్రీ సరస్వతి గోవిందరాజు గారి 10 -08- 2024 వ తేదీన 3 వ ఆధ్మికం కార్యక్రమాలు నిర్వహించబడుతాయన్నారు.

 On Monday 5th Of This Month Gita Spiritual Programs Will Start In Satsang Sadan,-TeluguStop.com

ప్లవనామ సంవత్సర శ్రావణ మాస శుద్ధ షష్టి శుక్రవారం.తేదీ 13- 08-2021 శుక్రవారం రోజున గోవిందా రాజు లు పరమపదించారు.3వ ఆధ్మికం పురస్కరించుకుని సత్సంగ సదనంలో తేదీ 05-08-2024 సోమవారం నుంచి తేదీ 14- 08 -2024 బుధవారం వరకు ఉదయం 09-00 గంటల నుంచి 12-00 గంటల వరకు మధ్యానం 2-00 గంటల నుంచి సాయంత్రం 5-00 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన బ్రహ్మశ్రీ సంగిరాల రాజేంద్ర ప్రసాద్ శాస్త్రి చే రామాయణం బోధిస్తారు.

గీత పారాయణ , శివ పూజ , సూర్య నమస్కారం , సత్సంగం ఉదయం 7-00 గంటల నుంచి 9-00 గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుండి 2-00 గంటల వరకు సత్సంగం సాయంత్రం ఏడు గంటల నుంచి 8 గంటల వరకు సత్సంగం సత్సంగ సదనం అధ్యక్షులు ఋ బ్రహ్మచారి లక్ష్మారెడ్డి బోధిస్తారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని లక్ష్మారెడ్డి కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube