గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.ఇందులో భాగంగా మాదాపూర్ లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించారు.
అలాగే అయ్యప్ప సొసైటీలో నిర్మాణాలను సైతం తొలగించారు అధికారులు.శేరిలింగంపల్లి జోన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
కాగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలను మూడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.