ఈ మధ్య మన టాలీవుడ్ స్థాయి పెరగడంతో మన స్టార్ హీరోలతో నటించేందుకు బాలీవుడ్ బ్యూటీలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో ఒకరైన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా తన తొలి టాలీవుడ్ సినిమా చేయడానికి సైన్ చేసింది.
ఈమె టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ”NTR30” లో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.
జాన్వీకి ఇదే తొలి పాన్ ఇండియన్ మూవీ కావడం విశేషం.
అందుకే ఈ సినిమా కోసం ఈమె చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంది.ఈ సినిమా నుండి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో ఈమె రోల్ ఏంటి అనేది బయటకు రావడంతో అందరు మరింత క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో జాన్వీ మత్సకారుడి కూతురుగా నటిస్తుందట.
మరి చూస్తుంటే ఈమె రోల్ కు ప్రాధాన్యత ఎక్కువ ఉండడం వల్ల ఈమె ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తుంది అని తెలుస్తుంది.ఇక ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో (Koratala Shiva) తెరకెక్కుతున్న ఈ సినిమా గత మూడు రోజుల క్రితమే షూట్ స్టార్ట్ చేసుకుంది.ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది.అయితే ఇప్పుడు పాన్ ఇండియా కావడంతో సర్వత్రా ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు.చూడాలి కొరటాల ఎన్టీఆర్ ఎలాంటి హిట్ అందుకుంటారో.