హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.ఈ మేరకు ప్రగతిభవన్ లో ఎంపీలతో ఆయన భేటీ కానున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్లమెంట్ సమావేశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.మరోవైపు మధ్యాహ్నం యూపీ మాజీ సీఎం అఖిలేశ్ సీఎం కేసీఆర్ తో భేటీకానున్నారు.
అయితే ఈ నెలలోని మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.