కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కేసీఆర్ కు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లేఖ రాశారు.సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినాన్ని ఘనంగా నిర్వహించాలని లేఖలో కోరారు.
ఆ రోజున పాతబస్తీలో తిరంగా యాత్రతో పాటు బహిరంగ సభను నిర్వహిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమానికి మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరు అవుతున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ను కూడా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.