జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి యాత్రతో ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే వారాహి( Varahi Yatra ) రెండు దశలు కావడంతో.
మూడో దశ కోసం జన సైనికులు అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే రేపు తిరుపతి జిల్లా ఎస్పీని పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు.
జనసేన పార్టీ నాయకుడి పై చేయి చేసుకున్న పోలీసు అధికారిపై ఫిర్యాదు చేయబోతున్నారు.ఇదిలా ఉంటే జనసేన పార్టీలో సినీ నిర్మాత బీవిఎస్ఎన్ ప్రసాద్( Producer BVSN Prasad ) నీ రాష్ట్ర కార్యదర్శి (కార్యక్రమాల నిర్వహణ కమిటీ) గా నియమించినట్లు అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఇక ఇదే సమయంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలను కూడా ప్రకటించడం జరిగింది.పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు నియోజకవర్గం ఇన్చార్జిగా టి.వి.రామారావును నియమించినట్లు పేర్కొనడం జరిగింది.సినీ నిర్మాత బీవిఎస్ఎన్ ప్రసాద్.పవన్ కళ్యాణ్ నటించిన “అత్తారింటికి దారేది”( Attarintiki Daredi ) సినిమా నిర్మించారు.2013లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.తెలుగు చలనచిత్ర రంగంలో ఇంకా చాలా పేరుగాంచిన సినిమాలు కూడా నిర్మించడం జరిగింది.