ఎమ్మెల్యే మైనంపల్లి భవితవ్యంపై సర్వత్రా ఉత్కంఠ..!

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు రాజకీయ భవితవ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆయన మంత్రి హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

 Mla Mynampalli's Fate Is All Tense..!-TeluguStop.com

అయితే ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ సైతం ఖండించారు.హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీకి మూలస్తంభంగా ఉంటారని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో హరీశ్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆయనపై వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.మరోవైపు మైనంపల్లి బీఆర్ఎస్ నుంచి పోటీపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అనుచరులు చెబుతున్నారు.

కాగా మైనంపల్లి రేపు తిరుపతి నుంచి రేపు హైదరాబాద్ కు రానున్నారు.ఈ క్రమంలో తనయుడు కోసం మైనంపల్లి పార్టీ మారతారా.? రాజకీయంగా ఆయన భవిష్యత్ ఏంటన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube