పల్నాడు జిల్లా: అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రి కామెంట్స్… నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి చంద్రబాబు నాయుడిని మూడు ప్రశ్నలు అడుగుతున్నా ఆయన సమాధానం చెప్పడం లేదు, పోలవరం సమీపంలో వేటిగట్టు దగ్గర చంద్రబాబు నిర్వహించే బహిరంగ సభలో అయినా కనీసం ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
మొదటి ప్రశ్న
పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు అంతా కేంద్రం భరించి నిర్మాణం చేయాలని విభజన చట్టంలో ఉంది,ఆ చట్టాన్ని పక్కన పెట్టేసి మేమే పోలవరం నిర్మిస్తామని చంద్రబాబు ఎందుకు భుజాన వేసుకున్నారు.
రెండవ ప్రశ్న
2018 కల్లా పోలవరం లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ కి నీళ్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామని శాసనసభలో బల్ల గుద్ది సవాల్ చేసిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదు.
మూడవ ప్రశ్న
కాఫర్ డ్యాం నిర్మాణం లేకుండా డయాఫ్రమ్వాల్ ఎలా నిర్మించారు ఇది చరితాత్మకమైన తప్పిదం కాదా….? నా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడితే ప్రజలను మోసం చేసినట్లే.చంద్రబాబు శాసనసభకు రాకుండా ఇదేమి కర్మా అని రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు…ఇది ఆయన కర్మే.
ఇదేమి కర్మలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
మీరు పెట్టే బహిరంగ సభకి జనం పెద్దగా రారు అది మాకు తెలుసు.
బహిరంగ సభలో ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయాలనే చౌకబారు ఎత్తుగడ వేస్తున్నారు.చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.
బహిరంగ సభకు హాజరయ్య వారందరికీ చెప్తున్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు.ప్రభుత్వం చూస్తూ,సహిస్తూ ఊరుకోదు.