టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఏపీ ప్రజలు టీడీపీ, పవన్ ను ఓడించి హైదరాబాద్ కు తరిమికొట్టారన్నారు.
ఇప్పుడు వారిద్దరూ ఏపీకి వస్తుంటే ప్రజలు ఇదేం కర్మరా అంటున్నారని విమర్శించారు.చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు.
రాయలసీమ వాసిగా చంద్రబాబును చూసి తలదించుకుంటున్నా అని తెలిపారు.కర్నూలుకు న్యాయ రాజధాని రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
ఆయన ఇకనైనా రాజకీయాలు మాని మనవడితో ఆడుకోవడం మేలని సూచించారు.చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.