స్టార్ హీరోగా ఉంటూ ఒక్కసారిగా జనసేన పార్టీ పెట్టి రాజకీయ ప్రస్తానం మొదలెట్టిన పవన్ కళ్యాణ్ కి ప్రజలలో మంచి చరిష్మా ఉంది.అయితే వాటిని ఓట్లుగా మలచుకోవడంలో పవన్ కళ్యాణ్ వైఫల్యం చెందాడు.
దీంతో గత ఎన్నికలలో ఘోరమైన ఓటమి చవిచూడాల్సి వచ్చింది.మరో వైపు వైసీపీ పవన్ కళ్యాణ్ మీద చేసిన విమర్శలు కూడా ప్రజల మీద ప్రభావం చూపించాయి.
ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.ఈ పరిణామాలు ముందుగా ఎవరూ ఊహించలేదు.
అయితే ఆయన రెండు, మూడు సార్లు ఢిల్లీ వెళ్లి రావడం తర్వాత బీజేపీతో ఉన్నపళంగా భేసారతుగా పొట్టు పెట్టుకోవడం జరిగింది.
ఈ పొత్తుపై జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ని నమ్మే వాళ్ళు అందరూ నమ్మితే, జనసేన పార్టీతో రాజకీయంగా ఎదగాలని, బీజేపీకి దూరంగా ఉండాలని భావించిన వారికీ రుచించలేదు.
అయితే బీజేపీ పార్టీలో మహిళా నేతగా ఉన్న పవన్ వీరాభిమాని మాజీ హీరోయిన్ మాధవీలత చాలా సంతోషం వ్యక్తం చేసింది.ఈ పొత్తు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బలమైన పునాది అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ మీద మాధవీలత ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.మొన్నటివరకు పవన్ ని విమర్శించిన బీజేపీ నాయకులే నేడు పవన్ వెనకాల తిరుగుతున్నారని సొంత పార్టీ నేతలపై మాధవీలత షాకింగ్ కామెంట్స్ చేసింది.
అంతేకాదు సినిమా వాళ్లకున్న చార్మ్, విలువ ఎవరూ మార్చలేరంటూ చెప్పుకొచ్చింది.ఎవరైనా సినీ నటుల వెనక నడవాల్సిందేనంటూ పవన్ కళ్యాణ్ పై వీరాభిమానం చూపించింది.ఆంధ్రా రాజకీయాలు వదిలేయాలనుకున్న కొందరు నాయకులు పవన్ రాకతోనే నిర్ణయం మార్చుకున్నారని చెప్పింది.