2005లో తెరకెక్కిన హార్రర్ కామెడీ మూవీ ‘చంద్రముఖి’ ఎలాంటి సెన్సేషనల్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే.దర్శకుడు పి.
వాసు తెరకెక్కించిన ఈ క్లాసికల్ మూవీలో లీడ్ పాత్రలో జ్యోతిక నటించగా, హీరోగా రజినీకాంత్ నటించారు.అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్గా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు సైతం అందుకుంది.
ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్తో అప్పటి నుండి హార్రర్ కామెడీ చిత్రాలు పెద్ద సంఖ్యలో రావడం మొదలయ్యాయి.
అయితే చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు దర్శకుడు పి.
వాసు.ఇప్పటికే కథను కూడా రెడీ చేసిన ఈ డైరెక్టర్, ఈ సీక్వెల్ చిత్రంలో హీరో పాత్రలో లారెన్స్ నటిస్తున్నట్లు అనౌన్స్ కూడా చేశాడు.
కాగా ఈ సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడు.ఇప్పటికే లారెన్స్ డైరెక్ట్ చేస్తున్న లక్ష్మీ బాంబ్ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తోంది.
దీంతో ఇప్పుడు చంద్రముఖి 2 చిత్రంలోనూ ఆమెను తీసుకోవడంతో, ఆమె సౌత్లో మరోసారి అదిరిపోయే గుర్తింపును తెచ్చుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమాను అతిత్వరలో పట్టాలెక్కించే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్.
‘చంద్రముఖి 2’ చిత్రం కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.గతంలో రజినీ, జ్యోతికలు క్రియేట్ చేసిన మ్యాజిక్ను లారెన్స్, కియారా ఎంతవరకు కొనసాగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా చంద్రముఖి చిత్రం మరోసారి వార్తల్లో నిలవడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పెట్టుకుంటున్నారు.