మహేష్‌కు ఆ మాస్ డైరెక్టర్ కథ వినిపించాడా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఎగబడి చూశారు.

 Kgf Director Approached Mahesh Babu, Kgf, Prasanth Neel, Ntr, Mahesh Babu, Sarka-TeluguStop.com

ఇక ఈ సినిమా అందించిన సక్సెస్‌తో మహేష్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

కాగా ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టకముందే, మహేష్ తన నెక్ట్స్ చిత్రాలను రెడీ చేసే పనిలో పడ్డాడు.

ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.కాగా ఈ సినిమా తరువాత మహేష్ మరో సినిమాను కూడా రెడీ చేసే పనిలో పడ్డాడు.

ఈ క్రమంలోనే కేజీఎఫ్ లాంటి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ మహేష్ కోసం ఓ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ కథను మహేష్‌కు వినిపించినట్లు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కాగా ఈ సినిమా కథ పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉందని, ఇది తన ఇమేజ్‌కు సెట్ అవుతుందో లేదో అనే సందేహం మహేష్‌లో నెలకొనడంతో ఈ సినిమా కథకు ఆయన ఓకే చెప్పలేదని టాలీవుడ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఏదేమైనా మహేష్ కోసం ప్రశాంత్ నీల్ కథను రెడీ చేశాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube