మహేష్‌కు ఆ మాస్ డైరెక్టర్ కథ వినిపించాడా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఎగబడి చూశారు.

ఇక ఈ సినిమా అందించిన సక్సెస్‌తో మహేష్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

కాగా ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టకముందే, మహేష్ తన నెక్ట్స్ చిత్రాలను రెడీ చేసే పనిలో పడ్డాడు.

ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

కాగా ఈ సినిమా తరువాత మహేష్ మరో సినిమాను కూడా రెడీ చేసే పనిలో పడ్డాడు.

ఈ క్రమంలోనే కేజీఎఫ్ లాంటి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ మహేష్ కోసం ఓ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ కథను మహేష్‌కు వినిపించినట్లు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కాగా ఈ సినిమా కథ పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉందని, ఇది తన ఇమేజ్‌కు సెట్ అవుతుందో లేదో అనే సందేహం మహేష్‌లో నెలకొనడంతో ఈ సినిమా కథకు ఆయన ఓకే చెప్పలేదని టాలీవుడ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఏదేమైనా మహేష్ కోసం ప్రశాంత్ నీల్ కథను రెడీ చేశాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆలయ భూములకు జియో ట్యాగింగ్..: మంత్రి కొండా సురేఖ