కాసేపట్లో తెలంగాణభవన్‎కు కేసీఆర్..మ్యానిఫెస్టో ప్రకటన!

బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మరికాసేపటిలో తెలంగాణభవన్ కు రానున్నారు.ఈ మేరకు ఆయన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గ ఇంఛార్జ్ లతో సమావేశం కానున్నారు.

 Kcr To Telangana Bhavan Soon..-TeluguStop.com

ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ బీ -ఫారాలు అందజేయనున్నారు.అదేవిధంగా ఎన్నికల ప్రచారంపై అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.తరువాత మధ్యాహ్నం 12.15 గంటలకు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కేసీఆర్ విడుదల చేయనున్నారు.అనంతరం మ్యానిఫెస్టోపై కేసీఆర్ ప్రసంగించనున్నారని తెలుస్తోంది.కాగా మ్యానిఫెస్టో విడుదల అనంతరం కేసీఆర్ పర్యటనలు ప్రారంభం కానున్నారు.ఈ మేరకు ఇవాళ్టి నుంచి నవంబర్ 9వ తేదీ వరకు కేసీఆర్ సభలకు షెడ్యూల్ ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ముందుగా హుస్నాబాద్ వేదికగా కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube