బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మరికాసేపటిలో తెలంగాణభవన్ కు రానున్నారు.ఈ మేరకు ఆయన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గ ఇంఛార్జ్ లతో సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ బీ -ఫారాలు అందజేయనున్నారు.అదేవిధంగా ఎన్నికల ప్రచారంపై అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.తరువాత మధ్యాహ్నం 12.15 గంటలకు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కేసీఆర్ విడుదల చేయనున్నారు.అనంతరం మ్యానిఫెస్టోపై కేసీఆర్ ప్రసంగించనున్నారని తెలుస్తోంది.కాగా మ్యానిఫెస్టో విడుదల అనంతరం కేసీఆర్ పర్యటనలు ప్రారంభం కానున్నారు.ఈ మేరకు ఇవాళ్టి నుంచి నవంబర్ 9వ తేదీ వరకు కేసీఆర్ సభలకు షెడ్యూల్ ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ముందుగా హుస్నాబాద్ వేదికగా కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.