టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో మెహర్ రమేష్( Meher Ramesh ) ఒకరు కాగా ఈ డైరెక్టర్ పేరు వింటే నిర్మాతలు పడే టెన్షన్ అంతాఇంతా కాదు.ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తక్కువ సినిమాలే తెరకెక్కినా ఆ సినిమా హీరోలుగా నటించిన వాళ్ల కెరీర్ లో డిజాస్టర్లుగా నిలిచాయి.
పూరీ జగన్నాథ్( Puri Jagannadh ) దగ్గర పని చేసిన మెహర్ రమేష్ బిల్లా సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు.ఈ సినిమాలో ప్రభాస్ ను మెహర్ రమేష్ స్టైల్ గా చూపించారని పేరు వచ్చింది.
విదేశాల్లో ఎక్కువగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది.అయితే తర్వాత రోజుల్లో ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో కంత్రి, శక్తి, షాడో తెరకెక్కగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. కంత్రి( shakti movie ) శక్తి సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా షాడో సినిమాలో వెంకటేశ్ హీరోగా నటించారు.
మెహర్ రమేష్ వల్ల టాలీవుడ్ నిర్మాతలకు అప్పట్లోనే 50 కోట్ల రూపాయల రేంజ్ లో నష్టాలు వచ్చాయని సమాచారం.అప్పట్లో 50 కోట్లు అంటే ఇప్పుడు దాదాపుగా 200 కోట్ల రూపాయలతో సమానమని చెప్పవచ్చు.మరికొన్ని రోజుల్లో భోళా శంకర్ మూవీ ( Bholaa Shankar )విడుదలవుతున్న నేపథ్యంలో మెహర్ రమేష్ గురించి మరోసారి చర్చ జరుగుతోంది.
భోళా శంకర్ సినిమా మెహర్ రమేష్ కెరీర్ కు కీలకమైన సినిమా అని ఈ సినిమాతో కచ్చితంగా మెహర్ రమేష్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మెహర్ రమేష్ తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా జవాబు చెప్పాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
మరి మెహర్ రమేష్ ఈ సినిమాతో నిజంగానే సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది.భోళా శంకర్ మూవీ ఆగష్టు నెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.