సౌత్ ఇండియాలో స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి శంకర్.డిఫరెంట్ కాన్సెప్ట్ లు తీసుకొని వాటికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తెరపై ఆవిష్కరించే శంకర్ సినిమాలు అంటే సౌత్ లో మంచి క్రేజ్ ఉంటుంది.
భారీ బడ్జెట్ చిత్రాలకి మొదటి నుంచి కేరాఫ్ అడ్రెస్ గా శంకర్ ఉన్నారు.ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన జెంటిల్మన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, ప్రేమికుడు, రోబో లాంటి సినిమాలు ఎప్పటికి ఎవర్ గ్రీన్ గా ఉంటాయి.
ఇక భారతీయుడుకి సీక్వెల్ గా ఇండియన్ 2ని తెరకెక్కించాలని అనుకొని రెండేళ్ళ క్రితం ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు.కమల్ హాసన్ లీడ్ రోల్ లో తెరకెక్కబోయే ఈ సినిమాని లైకా ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అయ్యింది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు.షూటింగ్ కూడా ప్రారంభమైంది.
అయితే సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి దీనికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి.ఇక లాక్ డౌన్ కి ముందు షూటింగ్ సెట్ లో క్రేన్ విరిగిపడి ఇద్దరు అసిస్టెంట్ దర్శకులు చనిపోయారు.
తరువాత లాక్ డౌన్ ఎఫెక్ట్ తో కంప్లీట్ గా సినిమా వాయిదా పడిపోయింది.
అయితే లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్ కోసం లైకా ప్రొడక్షన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒకానొక సమయంలో శంకర్ ఓపెన్ లెటర్ కూడా రాసాడు.
అయినా వారు స్పందించలేదు.ఇక కమల్ హసన్ కూడా రాజకీయాలలో బిజీ అయిపోయాడు.ఇక కాజల్ అగర్వాల్ కూడా తన ఇతర సినిమాలతో బిజీ అయిపొయింది.ఇక తాజాగా శంకర్ కూడా రామ్ చరణ్ తో నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు.
ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయింది. దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నాడు.
ఇదిలా ఉంటే మోసగాళ్ళు ప్రమోషన్ ఈవెంట్ లో కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 సినిమాపై క్లారిటీ ఇచ్చింది.ఆ సినిమా ఆగిపోయిందని చెప్పేసింది.
దీంతో ఇన్ని రోజులు కొనసాగిన ఇండియన్ 2 సస్పెన్స్ కి తెరపడినట్లు అయ్యింది.