బుల్లి తెర యాంకర్లలో సుమ తర్వాత అత్యంత ప్రజాధరణ ఉన్న యాంకర్ జాన్సీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.జాన్సీ కెరీర్ పరంగా బాగానే ఉన్నా వ్యక్తిగతంగా మాత్రం ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
నటుడు జోగి నాయుడును ప్రేమించి పెళ్లి చేసుకున్న జాన్సీ కొన్ని కారణాల వల్ల వదిలేసిన విషయం తెల్సిందే.వీరిద్దరు విడిపోయిన సమయంలో చాలా వార్తలు వచ్చాయి.
జోగి నాయుడు విపరీతమైన వేదింపుల కారణంగానే జాన్సీ అతడిని వదిలేసిందని అంతా అనుకున్నారు.
మీడియాలో ఆ విధంగానే ప్రచారం జరిగింది.
ఆ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని తాజాగా జోగి నాయుడు మొదటి సారి తమ వైవాహిక జీవితం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ఇద్దరం కెరీర్ ఒకే సారి ఆరంభించాం.
ఇద్దరం ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం.ప్రేమించి పెళ్లి చేసుకున్న మేము 8 సంవత్సరాలు బాగానే ఉన్నాం.
ఎప్పుడైతే జాన్సీకి డబ్బుపై ఆసక్తి పెరిగిందో, ఇతరులను చూసి వారి మాదిరిగా జల్సాగా ఉండలేక పోతున్నామనే ఆలోచన కలిగిందో అప్పటి నుండి గొడవలు ప్రారంభం అయ్యాయి.
మా ఇద్దరి మద్య ఆర్ధిక పరమైన గొడవలు వచ్చాయి.సంపాదన తక్కువ అవ్వడం ఖర్చులు ఎక్కువ అవ్వడంతో ఇద్దరికి విభేదాలు తలెత్తాయి.జాన్సీ విపరీతమైన జల్సాలు కోరుకునేది.
ఆ కారణంగానే ఇద్దరం విడిపోవాల్సి వచ్చిందని జోగి నాయుడు అన్నాడు.ఆమె తిరిగి నన్ను అర్ధం చేసుకుంటుందనే ఉద్దేశ్యంతో 8 ఏళ్ల పాటు ఆమె కోసం ఎదురు చూశాను.
ఆమె ఎప్పుడు కూడా మళ్లీ నాపై ఆసక్తి ఉన్నట్లుగా ప్రవర్తించలేదు.దాంతో ఆమెపై ఆశ వదిలేసి మరో పెళ్లి చేసుకున్నట్లుగా జోగి నాయుడు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.