టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరు బాగా హాట్ టాపిక్ గా మారింది.
అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న రష్మిక.ప్రస్తుతం స్టార్ హీరోల సరసన పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తుంది.
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది ఈ కన్నడ బ్యూటీ.తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో చేసిన భీష్మ సినిమాలు చేసి స్టార్ హోదాకు చేరుకుంది.
అలా వరుసగా మంచి మంచి సక్సెస్ లు అందుకుంది.ఇక ఏడాది కిందట అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాలో నటించగా ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది.
పైగా బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్స్ రావటంతో అక్కడ కూడా చాలా బిజీగా మారింది.ఇక త్వరలో పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ మధ్య ఈ బ్యూటీ క్రేజ్ బాగా తగ్గిందని అర్థమవుతుంది.ఇంతకు అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి( Venu Swamy ) గురించి అందరికీ తెలిసిందే.ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెప్పి బాగా హాట్ టాపిక్ గా నిలిచాడు.
అయితే తాజాగా రష్మిక గురించి మరో వార్త చెప్పడంతో ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.గతంలో రష్మికరక్షిత్ శెట్టి( Rakshit Shetty )తో ఎంగేజ్మెంట్ చేసుకొని బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే.అయితే అలా బ్రేకప్ చెప్పమన్నది ఎవరో కాదు వేణు స్వామియే అని.పైగా స్వయంగా ఆయననే ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉందని ఒకవేళ ఆ నిశ్చితార్ధం తర్వాత పెళ్లి చేసుకుంటే.ఆమె కెరియర్ కొల్లాప్స్ అవుతుందని జాతకంలో అలాగే రాసిందని వేణు స్వామి చెప్పుకొచ్చాడు.
అలా రష్మిక అతగాడికి బ్రేకప్ చెప్పటంతో ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది.అయితే మళ్లీ రష్మిక ఆయన మాటలు వినకుండా మరో తప్పు చేయడంతో ప్రస్తుతం ఆమె కెరీర్ ఇప్పుడు ఇలా ఉందని ఆయన మరోసారి కామెంట్లు చేసినట్టు తెలిసింది.
అదేంటంటే రష్మిక విజయ్ దేవరకొండ( Vijay Devearkonda ) తో గతంలో క్లోజ్ గా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక తో విజయ్ కు దూరంగా ఉండమని చెప్పుకొచ్చాడట.విజయ్ జాతకం ప్రకారం ఆయనతో ఎవరు కలిసిన సరే వాళ్ళ కెరియర్ నాశనం అవుతుందని అన్నాడు.అదే విషయం తను రష్మికకు చెబితే తను మాత్రం తన మాట వినలేదని అందుకే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందని అన్నాడు.
దీంతో ఇప్పటికైనా రష్మిక ఆలస్యం చేయకుండా విజయ్ దేవరకొండకు దూరం కావడమే మంచిది.లేకపోతే ఆమెకి దరిద్రం పట్టుకుంటుంది కామెంట్లు చేశాడు.అయితే గత కొన్ని రోజుల నుండి రష్మిక విజయ్ కు దూరంగా ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.బహుశా తన కెరీర్ కోసమే ఆయనను దూరం పెట్టిందేమో అని అనుమానాలు వస్తున్నాయి.
ఇక వేణు స్వామి రష్మిక గురించి చెప్పిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి
.