T20 వరల్డ్ కప్ టోర్నీలో జింబాబ్వే పై భారత్ గెలిచింది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
దీంతో రెండో బ్యాటింగ్ కి దిగిన జింబాబ్వే 115 పరుగులకే ఆల్ అవుట్ అయింది.ఈ విజయంతో గ్రూప్ 2లో అత్యధిక పాయింట్లతో ఇండియా టాప్ ప్లేస్ లో నిలిచింది.
పదవ తారీకు సెమిస్ లో ఇంగ్లాండ్ తో భారత్ తలపడనుంది.
ఇక ఇదే గ్రూపులో పాకిస్తాన్ కూడా సెమీస్ కి చేరుకుంది.
ఉదయం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ గెలవడం జరిగింది.సెమీస్ లో న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది.
సెమిస్ లో భారత్ మరియు పాకిస్తాన్ గెలిస్తే ఫైనల్ మ్యాచ్.ఈ రెండు దాయాది దేశాలు తలపడనున్నాయి.
ఆల్రెడీ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా గెలవడం జరిగింది.ఈ రెండు టీమ్స్ ఫైనల్ కొస్తే బాగుంటుందని చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.