శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.ధర్మవరం మండలంలోని గొట్లూరు గ్రామ పర్యటనకు వెళ్లిన ఆయనకు నిరసన సెగ తగిలింది.
గ్రామంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని ఓ ఆర్మీ జవాన్ ఎమ్మెల్యే కేతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.సచివాలయ ఉద్యోగులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇదేమిటని ప్రశ్నించడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి కొంత అసహానానికి గురైనట్లు తెలుస్తోంది.