ఈ వార్త నిజం కాక పోవచ్చు కానీ నిజమైతే సంచలనమే!!

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఈ సంక్రాంతికి ‘పేట’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ చిత్రం తర్వాత రజినీ మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించడానికి ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

 Happy With This News Of Rajamouli And Rajinikanth Combo Is Fixd-TeluguStop.com

విభిన్నమైన థీమ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు మురుగదాస్‌ ఇప్పటికే సన్నాహాలు షురూ చేశాడు.మురుగదాస్‌ చిత్రం తర్వాత రజినీ కార్తీక్‌ సబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

త్వరలో రజినీ రాజకీయ అరంగేట్రం చేయనున్నాడనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో వరుస చిత్రాలకు సైన్‌ చేస్తున్నాడు.

మురుగదాస్‌, కార్తీక్‌ సుబబ్బరాజులతో ప్రాజెక్ట్‌లు పూర్తి చేసుకున్నాక దర్శకధీరుడు రాజమౌళితో తళైవ ఓ చిత్రాన్ని చేయనున్నాడని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.రజినీ తాను ముందుగా ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి, రాజమౌళికి బల్క్‌ డేట్లను కేటాయించనున్నట్టుగా టాక్‌.ఈలోగా రాజమౌళి కూడా రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌ను పూర్తి చేస్తాడు.

ఈ భారీ మల్టీస్టారర్‌ పూర్తి చేసి సూపర్‌స్టార్‌ కోసం ఓ మంచి కథను రెడీ చేస్తాడని టాక్‌.

ఈ వార్త నిజం కాకపోవచ్చు కానీ నిజమైతే మాత్రం సంచలనమే.తెలుగు సినిమా చరిత్రకు ఓ స్థాయిని తెచ్చి పెట్టిన దర్శకుడు రాజమౌళి సౌత్‌ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ల కాంభో అంటే అది మామూలు విషయం కాదు.వీరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ వార్త నిజం అయితే భావుండు అని భావిస్తున్నారు.

అయితే దీనిపై రజినీ, రాజమౌళి ఎలా స్పందిస్తానే అనేదాన్ని బట్టి ఇరువురి కాంభోలో భారీ చిత్రం ఉంటుందా? ఉండదా? క్లారిటీ వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube