ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఆయనది తిరుగులుని చరిత్ర అనే చెప్పాలి.ఒకప్పుడు స్టార్ ఆల్ రౌండర్ గా ఇండియాను ఎన్నో సార్లు గెలిపించిన చరిష్మా అతనికి ఉంది.
అయితే అనూహ్యంగా అతను క్రికెట్కు గుడ్ బైచెప్పేయడంతో ఆయన అభిమానులు అప్పటి నుంచి తీవ్ర నిరాశలోనే ఉన్నారు.అయితే ఇప్పుడు అతను రీ ఎంట్రి ఇస్తున్నట్టు చెప్పేశాడు.
ఆయనెవరో కాదు స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.తాను ఏడాదిలో ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించేశాడు.
ఫిబ్రవరి నెలలో గ్రౌండ్ లో అడుగు పెడుతున్నట్టు చెప్పడంతో ఆయన అభిమానులు ఫుల్ కుషీలో ఉన్నారు.
యువరాజ్ సింగ్ 2019 జూన్లో టీమ్ ఇండియాకు గుడ్ బై చెప్పేశాడు.
ఆయన రిటైర్ మెంట్ అనేది అసలు ఎవరూ ఊహించనటువంటిది.ఎందుకంటే అప్పటికీ స్టార్ ఆల్ రౌండర్ గానే ఉన్న యువరాజ్.
కేవలం కొంత గ్యాప్ రావడంతో ఆ నిర్ణయం తీసుకున్నాడు.పైగా అతని వయసు కూడా ఏమంత పెద్దది కాదు.
దీంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిలో కూరుకుపోయారు.ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్లో ఇండియా తరఫున అగ్రశ్రేణి బ్యాట్స్మెన్గా యువరాజ్ అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా వరల్డ్ కప్ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆ వరల్డ్ కప్ మ్యాచ్లో ఏకంగా మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్ను యువరాజ్ అందుకున్నాడంటేనే ఆయన కృషి ఏంటో అర్థం చేసుకోవచ్చు.దాదాపు 90.50 సగటుతో 362 రన్స్ చేసిన చరిత్ర యువరాజ్కు ఉందంటే ఆయన చరిష్మా అర్థం చేసుకోవ్చు.యువీ చివరిసారిగా గత మార్చి నెలలోనే రోడ్ సేఫ్టీ సిరీస్లో మైదానంలో ఆడాడని తెలుస్తోంది.
అయితే ఇప్పటి దాకా ఐపీఎల్ లో ఆడుతున్న అతను.ప్రజల డిమాండ్ మేరకు మళ్లీ పునరాగమనం చేస్తున్న యువరాజ్ సింగ్ ప్రకటించాడు.
త్వరలోనే దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించనున్నట్టు సమాచారం.