బీజేపీలో ఆ ఇద్దరు దుర్యోధన, దుశ్శాసనులు... సీనియర్ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

దేశ రాజకీయాలలో ఇప్పుడు బీజేపీ పార్టీ మీద విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని తప్పు పడుతున్నారు.ఓ విధంగా చెప్పాలంటే మోడీ, అమిత్ షా కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీతో పాటు, ఇతర ప్రాంతీయ పార్టీలు అరిచి గగ్గోలు పెడుతున్నాయి.

 Former Union Minister Yashwant Sinha Hit At Top Bjp Leaders-TeluguStop.com

అయితే వారు ఎవరిని లెక్కచేయకుండా తమ పంథాలో వెళ్తున్నారు.వారు తీసుకుంటున్న నిర్ణయాలని మెజారిటీ ప్రజలు ఆమోదిస్తూ ఉంటే, విపక్షాలు మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతలు అమిత్ షా, మోడీ మీద విమర్శలు చేస్తూ అమిత్ షా టుక్ డే టుక్ డే గ్యాంగ్ అంటూ అన్నారు.దీనిని సమర్ధించే విధంగా ఒకప్పటి కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మోడీ, అమిత్ షా మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన ”టుక్‌డే టుక్‌డే” గ్యాంగ్‌ కేవలం ఇద్దరు వ్యక్తులతోనే బీజేపీ పార్టీలో ఏర్పడి ఉందని అన్నారు.ఆ ఇద్దరూ దుర్యోధన, దుశ్శాసనులని ఘాటుగా ట్వీట్‌ చేశారు.

వారితో అందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలలో మోడీ, అమిత్ షా ప్రస్తావన లేకపోయినా నేరుగా వారినే టార్గెట్ చేసినట్లు ఉన్నాయని రాజకీయ వర్గాలలో చర్చించుకుంటున్నారు.

జస్వంత్ సిన్హా బయటకి వెళ్ళిపోవడానికి కారణం వీరిద్దరే అనే మాట రాజకీయాలలో వినిపించగా ఇప్పుడు అతను చేసిన వ్యాఖ్యలు వాటిని నిజం చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube