మానవ సంబంధాలు ఎంత దారుణంగా తయారయ్యాయో ఈ మధ్య జరిగిన సంఘటనలు తరుచుగా నిరూపిస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం గోదావరిఖని లో ఓ తల్లి తన ఇద్దరి బిడ్డలని ఇటుక రాయితో కొట్టి ఒకరి చావుకి కారణం అయ్యింది.
తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో దారుణం చోటు చేసుకుంది.ఆస్తిగొడవల కారణంగా ఓ తండ్రి తన ఇద్దరు కుమారులని కర్కసంగా గొంతు కోసి చంపేశారు.
తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
రమణమూర్తి అనే వ్యక్తి తన ఇంట్లో ఆస్తికి సంబంధించిన గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
దీంతో నాగ దినేశ్, సాయి అనే ఇద్దరు కుమారులని గొంతుకోసి చంపేసాడు.తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే వీటికి ఆస్తి గొడవలే కారణం అని చెప్పిన కుటుంబ కలహాలు, ఆర్ధిక సంబంధమైన కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ తెలియజేస్తున్నారు.