మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకొని మామకి తగ్గ అల్లుడు అనిపించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్.ఈ యువ హీరో కెరియర్ లో ఎంత వేగంగా హైప్ క్రియేట్ చేసుకున్నాడో, అంతే వేగంగా వరుసగా ఐదు ఫ్లాప్ సినిమాలతో కెరియర్ లో బ్యాక్ కి పడిపోయాడు.
అయితే ప్రస్తుతం ఈ మెగా హీరో కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి అనే సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు.
ఇదిలా వుంటే తేజ్ ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు అనే టాక్ ఆ మధ్య వినిపించింది.
అయితే అతని లుక్ ఎలా వుంటుంది అనే విషయంలో మాత్రం ఇన్ని రోజులు క్లారిటీ లేదు.ఇదిలా వుంటే తాజాగా తేజ్ తన ట్విట్టర్ ఎకౌంటులో గెడ్డం లుక్ తో స్టైలిష్ గా దర్శనం ఇచ్చాడు.
ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ గెడ్డంతో సూపర్ హిట్స్ కొట్టారు.ఈ నేపధ్యంలో తేజ్ కూడా అలాంటి గెటప్ తోనే ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో వున్నట్లు కనిపిస్తుంది.
ఈ కారణంగా ఇప్పటి వరకు రెగ్యులర్ గా కనిపించిన తేజ్ మొదటి సారి డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది.







