జాతి వివక్ష పేరు చెప్పగానే చటుక్కున గుర్తుకు వచ్చేది అమెరిక పేరే.ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత జాతి వివక్ష పేరు ఎక్కువగానే వినపడుతూ వచ్చింది.
ముఖ్యంగా నల్లజాతీయులపై అమెరికాలో చూపించే వివక్షపై యావత్ ప్రపంచం నివ్వెర పోయేలా ఎన్నో సంఘటనలు జరిగాయి కూడా.సరిగ్గా ఎన్నికల ముందు జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఉదంతం,అలాగే మరో ఇద్దరు నల్లజాతీయులపై జరిగిన హత్యలు అన్నీ ఒక్కసారిగా అమెరికాను ప్రపంచ దేశాల ముందు జాత్యహంకార దేశంగా నిలబెట్టాయి.
అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన అమెరికా సమాజం తలదించుకునేలా కాండ్రించి ఉమ్మేలా చేస్తోంది.అమెరికాలో ఇండియానా పోలీస్ కు చెందిన సునాన్ మూర్ అనే నల్లజాతీయురాలైన వైద్యురాలు కరోనాతో మృతి చెందింది.
సునాన్ మూర్ కు కరోనా సోకకముందు ఎంతో మంది కరోనా రోగులకు సేవలు అందించింది.అలుపెరుగకుండా ఆమె ఎంతో మందికి సేవలు అందించింది.ఈ క్రమంలోనే ఆమెకు కరోనా సోకింది.అప్పుడు కానీ అర్థం కాలేదు తన చుట్టూ ఉండే అమెరికన్స్ వివక్ష.
సరైన వైద్యం అందక ఆమె మృతి చెందిన ఘటన ఎంతో మందిని కదిలించింది.ఆమె చనిపోయే ముందు చేసిన ఓ వీడియో అమెరికాలో జాతి వివక్ష ఏ స్థాయిలో ఉందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.చనిపోయే ముందు సునాన్ మూర్ తన సెల్ఫీ వీడియో తీసుకున్నారు.అమెరికాలో నల్లజాతీయులపై ఎలాంటి వివక్ష ఉంటుందో తెలుసా అంటూ వీడియో చేశారు ఆమె.తన ఆరోగ్యం గురించి తన తోటి వైద్యులు అస్సలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె.తాను నల్లజాతీయురాలు కాకుండా ఉండి ఉంటే తప్పకుండ బ్రతికి ఉండేదానినని ఆ వీడియో లో తెలిపారు.అమెరికాలో కరోనా కారణంగా నల్లజాతీయులు చనిపోవడం లేదని చంపేస్తున్నారని, వారికి వైద్యం అందనివ్వడం లేదని వాపోయారు.బిడెన్ అధికారం చేపట్టనున్న తరుణంలో ఆమె వీడియో కి ప్రాధాన్యత సంతరించుకుంది.