ఇండస్ట్రీలో హిట్ మాత్రమే ప్రతి విషయాన్ని నిర్ధారిస్తుంది అని మనకు తెలిసిందే.ఆ హిట్టు మాత్రమే మరిన్ని అవకాశాలను సృష్టిస్తుంది.
టాలీవుడ్ లో కూడా విజయాలు దక్కిన, పరాజయాలు దక్కిన సినిమాలు చేయలేకపోతున్నారట కొంతమంది దర్శకులు.అందుకు అనేక కారణాలు ఉన్నాయి.
మరి ఇప్పట్లో సినిమాలు తీయడం సాహసమే కదా అందుకే సరైన నిర్ణయం తీసుకోవడం అలాగే సరైన టైంలో పనులు చేయడం చాలా ముఖ్యం.అందుకే టాలీవుడ్ లో కొంతమంది దర్శకులకు ప్రస్తుతం హీరోలు దొరకడం లేదట.విజయాలు చేతిలో ఉన్న కూడా కొత్త సినిమా చేయడానికి సరైన దొరకక ఖాళీగా ఉంటున్నారు ఇంతకీ ఆ డైరెక్టర్స్ ఎవరు ? ఎందువల్ల ఖాళీగా ఉండాల్సి వస్తుంది అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
పూరి జగన్నాథ్
ఒక హిట్టు పడితే నాలుగు ఫ్లాపులు అన్నట్టుగా ఉంది పూరి జగన్నాథ్( Puri Jagannath ) కెరియర్.ఆయన చాలా ఏళ్లుగా జనగణమన కథ అది చేసుకొని సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అదే కుదరడం లేదు.మొదట మహేష్ బాబుతో సినిమా తీయాలని భావించిన అప్పుడు కొన్ని కారణాలతో అది జరగలేదు.
ఇక ఈ మధ్య విజయ్ దేవరకొండ తో మరో ఆ ప్రయత్నం జరిగిన బడ్జెట్ కారణాల చేత ఈ సినిమా పట్టాలెక్కలేదు.
చందు మొండేటి
కార్తికేయ సినిమా మంచి విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా కార్తికేయ 2 కూడా తీసి పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్నాడు చందు మొండేటి( Chandu mondeti ).అయినా కూడా ఆయన మరో సినిమా చేయలేకపోతున్నారు.అందుకు గల కారణం ఆయనకు సరైన హీరో దొరకడం లేదు.
పైగా గీత ఆర్ట్స్ వారితో ఆయనకు ఒప్పందం ఉండడంతో అది దాటి బయటకు రాలేకపోతున్నారు.ఆ రకంగా చందు మొండిట సినిమా స్టార్ట్ అవ్వడం లేదు.
ఇక తాజాగా చందు మొండేటి తండేల్ అని ఒక సినిమాతో నాగచైతన్యం డైరెక్ట్ చేయబోతున్నాడు.
మెహర్ రమేష్
శక్తి సినిమా డిజాస్టర్ అందరికీ గుర్తుండిపోయే చిత్రం.ఈ సినిమాకి డైరెక్టర్ గా మెహర్ రమేష్( Meher Ramesh ) పని చేశారు.ఆ డిజాస్టర్స్ ఫలితాల కారణంగా దాదాపు 8 ఏళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాడు రమేష్.
మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగా చిరంజీవి భోలా శంకర్ సినిమా అవకాశం ఇస్తే అది కూడా మళ్ళీ డిజాస్టర్ అయింది.దాంతో ఆయన మరో సినిమా లో నటించడానికి ఎవరు ముందుకు రావడం లేదు
.