దేశంలో కరోనా విజృంభన మామూలుగా లేదు.గత నెల రోజులుగా కరోనా కేసుల సంఖ్య 50 వేలకు పైగానే ఉంటున్నాయి తప్ప తగ్గడం లేదు.
ఇక ఏపీలో కూడా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా ఉంది.ఏపీలో రోజుకు పది వేల చొప్పున కరోనా కొత్త కేసులు నమోదు అవుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటిస్తుంది.
ఇక నేడు ఏపీలో కొత్తగా 10526 కేసులు నమోదు అయ్యాయి.ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలను మించింది.
ఈ సంఖ్య ఇంత త్వరగా చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదు.
ఏపీలో ఇప్పటి వరకు కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3714 కు చేరింది.
ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 96191గా ఉన్నాయి.గత 24 గంటల్లో 61 వేల కోవిడ్ టెస్టులను నిర్వహించగా 10526 కేసులు నమోదు అయ్యాయి.
ఏపీలో రికవరీ రేటు అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు.ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టేందుకు కనీసం నెల రోజులు పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
అప్పటి వరకు మరో రెండు మూడు లక్షల వరకు అయినా కొత్త కేసులు నమోదు అవుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది.ప్రజలు అప్రమత్తంగా ఉండటం తప్ప మరో మార్గం లేదు అంటున్నారు.