రాష్ట్ర ప్రజల్లారా కరోనా కాస్త రెస్ట్ తీసుకోగానే మన జీవన విధానం ఎంత ఆనందంగా సాగిపోతుంది.కానీ ఒక్క విషయం గురించి ఆలోచించారా.
మళ్ళీ కరోనా వింజృంభన కొనసాగి కేసుల సంఖ్య ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతుంటే ఏర్పడే అల్లకల్లోలం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించండి.
పెరిగిన ధరలతో, చాలీచాలని ఆదాయంతో బ్రతుకులు నరకం అవుతాయన్న విషయాన్ని విస్మరించి జీవిస్తున్న జనుల్లారా కరోనా మళ్లీ తన ప్రతాపాన్ని చూపెడుతుంది.
కాబట్టి కరోనా కట్టడికి సంబంధించిన ఏ అంశం అయినా తేలికగా తీసుకోకండి.ఇకపోతే తాజాగా ఉస్మానియా యూనివర్సిటీని కూడా కరోనా పలకరించింది.
ఈ క్రమంలో ఓయూ లేడీస్ హస్టల్లో ఇద్దరు పీజీ విద్యార్థినులు కరోనా బారినపడ్డారని సమాచారం.కాగా వారిద్దరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో కోఠి ఆసుపత్రికి తరలించారట అధికారులు.
ఇకపోతే 400 మంది విద్యార్థినులు ఉన్న ఓయూ లేడీస్ హాస్టల్లో ప్రస్తుతం ఇద్దరికి పాజిటివ్ అని తేలడంతో మిగతా వారిలో కూడా టెన్షన్ ప్రారంభమైంది.మరో వారం ఆగితే గానీ ఎన్ని కరోనా కేసులు ఇక్కడ నమోదు అయ్యాయో బయటకు వస్తుంది.
ఇకపోతే ఓయూ లేడీస్ హస్టల్ రూంలను అధికారులు శానిటైజ్ చేస్తున్నారట.