బిల్డింగ్‎పై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య..!

ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే అదే భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ కరోనా రోగి.ఈ ఘటన గురువారం హైదరాబాద్‎లోని శ్రీనగర్ కాలనీలో చోటు చేసుకుంది.

 Corona Patient, Sucide, Private Hospital, Hyderabad, Indian Airforce-TeluguStop.com

వివరాల్లోకి వెళ్తే.ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి నాగేంద్ర ఇండియన్ ఎయిర్‎ఫోర్సులో విధులు నిర్వహిస్తున్నాడు.కొద్ది రోజుల క్రితం నాగేంద్రకు కరోనా పాజిటివ్‎గా తేలింది.దీంతో అతని కుటుంబ సభ్యులు, శ్రీ నగర్ కాలనీలోని నిఖిల్ హాస్పిటల్‎లో చేర్చి చికిత్స ఇప్పిస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం నాగేంద్ర హాస్పిటల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.పై నుంచి చెట్ల మీద పడడంతో నాగేంద్రకు తీవ్ర గాయాలు అయ్యాయి.

ఇది గమనించిన సిబ్బంది నాగేంద్రను ఆస్పత్రిలోకి తీసుకెళ్లి చికిత్సను అందించారు.ఈ క్రమంలో చికిత్స పొందుతూ నాగేంద్ర మృతి చెందాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.నాగేంద్ర ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి వివరాలను సేకరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube