తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు పెద్ద ఎత్తున అధికార ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలతో పెద్ద ఎత్తున ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇక మార్చి 7 న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఇక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ను ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.అయితే నేడు భట్టి విక్రమార్క అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పట్ల సమావేశం కానున్నారు.
అయితే ప్రజల మధ్యలో కాంగ్రెస్ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్న ప్రస్తుత తరుణంలో బడ్జెట్ సమావేశాలను ఇక తమకనుగుణంగా మార్చుకునేందుకు పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తూ గత అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చినటువంటి హామీలను మరొక్క సారి ప్రభుత్వానికి గుర్తు చేసి హామీలను నెరవేర్చక పోవటం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీ వేదికగా కడిగిపారేయనున్నారు.
అయితే ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ప్రతిపక్షాలు ఎంతగా విమర్శించాలని చూసినా ప్రజల్లో ప్రతిపక్షాలు పలుచన కావడం తప్ప వేరే లాభం ఏమీ ఉండదని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్న పరిస్థితి ఉంది.
అయితే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తరువాత ప్రజలలో ప్రత్యామ్నాయ పార్టీగా ఉండాలనే ఉద్దేశ్యంతో అంతేకాక తెలంగాణలో మునుపటి కాంగ్రెస్ ను ప్రజలకు పరిచయం చేయాలని రేవంత్ కెసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ ప్రజల చూపు కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు రకరకాల కార్యాచరణను సిద్దం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.మరి బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనేది చూడాల్సి ఉంది.