తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) అన్నారు.హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు( Congress ) ఓట్లు అడిగే హక్కు లేదని తెలిపారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) చెప్పాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని తెలిపారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) తెలంగాణలో 17 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.