దేశంలో మరోసారి మోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( BJP Kishan Reddy ) అన్నారు.తెలంగాణలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) ఎలా అమలు చేస్తుందో చెప్పాలన్నారు.
ఆరు గ్యారెంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్నించారు.బస్సుల్లో ఉచిత ప్రయాణం వలన జీవితాల్లో వెలుగులు రావని కిషన్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్( BRS ) రెండు కుటుంబ పార్టీలేనని విమర్శించారు.