తెలంగాణలో ప్రధాని మోదీ( PM Modi ) పర్యటన కొనసాగుతోంది.ఈ మేరకు నారాయణపూట్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు( DK Aruna ) మద్ధతుగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
కాంగ్రెస్ కూటమి( Congress Alliance ) అబద్ధాల హామీలు ఇస్తోందని మోదీ ఆరోపించారు.మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ అని చెప్పారు.
పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.మోదీ గ్యారంటీ అంటే పూర్తిగా అమలయ్యే గ్యారంటీ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఫేక్ వీడియోలతో లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్ఆర్ ట్యాక్స్ మొదలైందన్నారు.
ఆర్ఆర్ ట్యాక్స్ ఎవరి జేబుల్లోకి వెళ్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ప్రజలు ఆఫ్రికన్లుగా కనిపిస్తున్నారన్న మోదీ నల్ల రంగు చర్మం ఉందని ఆఫ్రికన్లు అంటున్నారని తెలిపారు.
అంతేకాకుండా హిందూ దేవుళ్లను పూజించడం.దేవాలయాలకు వెళ్లడం కాంగ్రెస్ కు నచ్చడం లేదని ఆరోపణలు చేశారు.