ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్ గొడవ పడుతున్నారు.ఏమిటీ గొడవ? ఇది రాజకీయ గొడవా? కాదు.రాజకీయాలు మిళితమైన ఆటలకు సంబంధించిన గొడవ.అసలు సంగతి ఏమిటంటే….ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడి గా తాను శనివారం ఎన్నికయ్యానని సీఎం రమేష్ చెప్పుకున్నాడు.కాని తాను ఈ నెల (ఏప్రిల్) నాలుగో తేదీనే ఏపీ ఒలింపిక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని గల్లా రమేష్ ప్రకటించాడు.
తిరుపతిలో జరిగిన ఈ ఎన్నికను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించిందని జయదేవ్ చెప్పాడు.దీనిపై స్పందించిన రమేష్ మాట్లాడుతూ జయదేవ్ ఈ విషయం మీద మాట్లాడకూడదని అన్నారు.
ఒలింపిక్ అసోసియేసన్ అంటే రాజకీయాలు కాదన్నారు.మొత్తం మీద ఒలింపిక్ అసోసియేషన్ అసలు అధ్యక్షుడు ఎవరో తెలియక క్రీడాకారులు అయెమయంలో ఉన్నారు.
ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు జరిగితే అది మీడియాకు వార్త అవుతుంది కదా.ఏప్రిల్ నాలుగో తేదీన ఎన్నికలు జరిగితే ఈ వార్త రాకుండా ఉంటుందా? ఇది రహస్యంగా జరిగే వ్యవహారం కాదు కదా.వీరిలో ఎవరు నిజమైన అధ్యక్షుడో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేలుస్తారా?
.