కరోనా వైరస్ అయినప్పటికీ టాలీవుడ్ లో స్టార్ల పెళ్లిళ్లు ఎం ఆగడం లేదు.ఎన్ని కరోనా వైరస్ కేసులు పెరిగిన సరే వారు పెట్టుకున్న ముహూర్తంలో అతి తక్కువమందిలో పెళ్లి చేసేసుకుంటున్నారు.
ఇప్పటికే దిల్ రాజు, నిఖిల్లు వివాహం చేసుకున్నారు.ఇంకా ఈ ఆదివారం నితిన్ కూడా షాలినిని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా కరోనా సమయంలోనూ టాలీవుడ్లో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి.నిఖిల్ పెళ్లి అనంతరం వచ్చే నెలలో దగ్గుబాటి వారసుడు రానా పెళ్లికి సిద్దమయ్యాడు.ఇంకా వీరి వివాహాన్ని హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో జరిపేలా పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు మొన్నటి వరకు వార్తలు హాల్ చల్ చేశాయి.
అయితే కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పుడు రానా పెళ్లి వేడుకలో మార్పులు చేశారు.వారి ఇంట్లోనే పెళ్లి చేయాలనీ రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు తీసుకున్నారు.ఈ విషయాన్నీ శుక్రవారం విడుదలైన వివాహ ఆహ్వాన పత్రికలో వెల్లడించారు.
మణికొండ ఖాజాగూడలోని చైతన్య ఎంక్లేవ్లో రానా పెళ్లి జరగనుంది.ఇంకా ఈ పెళ్ళికి అతికొద్ది మంది హాజరుకానున్నారు.
కాగా రానా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంగతి విదితమే.