ఈ మధ్యకాలంలో కొందరు యువకులు యుక్త వయసు రాగానే ప్రేమ, వివాహేతర సంబంధాలు వంటివి వాటి కారణంగా తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. తాజాగా బీటెక్ చదువుతున్న ఓ యువకుడు పెళ్లైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని చివరికి ఆ విషయం ఊర్లో వాళ్లకి తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని సత్తెనపల్లి పరిసర ప్రాంతంలో శ్రీనివాస రావు అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస రావు స్థానికంగా ఉన్నటువంటి ఓ పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
అయితే ఇటీవలే వీరిద్దరూ ఏకాంతంగా కలుసుకున్న సమయంలో కొందరు గ్రామస్తులు చూసి ఇరువురిని మందలించారు.దీంతో ఈ విషయం అందరికీ తెలియడంతో శ్రీనివాస రావు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని గ్రామం దగ్గరలో ఉన్నటువంటి కరెంట్ సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
దీంతో బాగా చదువుకొని తమని పోషిస్తాడని అనుకున్న కన్న కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకొని విగత జీవిగా మారడంతో ఆ కుటుంబ సభ్యుల ఆర్థనాదాలు మిన్నంటాయి.దీంతో కొందరు స్థానికులు ఈ విషయంపై స్పందిస్తూ శ్రీనివాస రావు తన కోరికలను అదుపు చేసుకోలేక పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తన జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకోవడమే కాకుండా తన కుటుంబ సభ్యుల ఆశలు అడియాశలు చేశాడంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.