టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మెగాస్టార్.ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమా( Waltair Veeraiah )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్.ఇక ఆ సంగతి పక్కన పెడితే తాజాగా వాల్తేర్ వీరయ్య 200 డేస్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
ఏపీ మంత్రులు, నేతలు పొలోమంటూ చిరుపై, ఇండస్ట్రీ పై పడిపోతున్నారు.ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వైసీపీ నేతలంతా( YCP Leaders ) మెగాస్టార్ చిరంజీవిని తెగ విమర్శిస్తున్నారు.మరోవైపు వైసీపీ కార్యకర్తలు మెగాస్టార్ చిరంజీవి సినిమాలని ఏపీలో ఆడనివ్వమంటూ #BoyCottBholaaShankar అనే హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.ఇంకొంతమంది #Boycott మెగా ఫ్యామిలీ హీరోస్ మూవీస్ అంటూ హడావిడి చేయడం మొదలు పెట్టారు.
కాగా శుక్రవారం విడుదల కాబోయే భోళా శంకర్ మూవీ( Bhola Shankar )ని బాయ్ కాట్ చేస్తామంటూ రెచ్చిపోయి సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు.మరోపక్క వైసీపీ నేతలకి మెగా ఫాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.
మా హీరో జోలికి వస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు.ఒకవేళ భోళా శంకర్ మూవీని బాయ్ కాట్ చేసి చూడండి.
పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ మాస్ గా వైసీపీ నేతలకి, కార్యకర్తలకి వార్నింగ్ ఇస్తున్నారు.ఇండస్ట్రీ మంచి కోసమే జగన్ ముందు నిలబడ్డారు మెగాస్టార్.కానీ మీరు మెగా హీరోలని( Mega Heroes ) కామెంట్స్ చేస్తున్నారు.అలాంటప్పుడు ఎందుకు ఊరుకోవాలి అంటూ మెగా ఫాన్స్( Mega Fans ) వైసీపీ నేతలపై ఒక రేంజ్లో విరుచుకుపడుతున్నారు.
భోళా శంకర్ సినిమాని బాయ్ కాట్ చేసి చూడండి మీ అంతు తెలుస్తామంటూ మెగా అభిమానూలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా భోళా శంకర్ సినిమా విషయంలో ఏమాత్రం పొరపాటు చేసినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు.