తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అభ్యర్థులకు ప్రజల నుండి పూర్తిస్థాయి మద్దతు లభిస్తుందని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని ఆమె విమర్శించారు తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఆమె అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.నేడు కూకట్ పల్లి నియోజకవర్గం లో జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలిపే లక్ష్యంగా ఆమె ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.కూకట్ పల్లి నుండి ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రేమ్ కుమార్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.