బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రభుత్వ లబ్దిదారుడేనని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్ దశాబ్ది ఉత్సవాలను కేసీఆర్ కుటుంబ ఉత్సవాలు అనడం అవివేకమని విమర్శించారు.
పసుపు బోర్డు పేరుతో రైతులను ముంచిన బీజేపీని ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరని మంత్రి వేముల తెలిపారు.అభివృద్ధి చేయని బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదని పేర్కొన్నారు.
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉందని చెప్పారు.తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు.