ఏపీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకనే రాజకీయ దుష్ట శక్తులు ఏపీలో విగ్రహాలను కూల్చి వేస్తున్నారని అన్నాడు.విగ్రహాల ద్వంసంకు పాల్పడిన వారిని వదిలేది లేదని వారు ఎవరైనా సరే ఏ పార్టీకి చెందిన వ్యక్తులైన సరే ఉపేక్షించేది లేదని జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
కొంత మంది రాజకీయంగ ఎదగడానికి దేవత విగ్రహాలను ద్వంసం చేస్తున్నారని విమర్శించాడు.
కొందరికి దేవుడు అంటే భక్తి భయం లేదని అన్నాడు.
హిందువుల మనోభావాలను దెబ్బ తియ్యడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నాడు.కావాలనే విగ్రహాలను ద్వంసం చేసి పైకి మళ్ళ రచ్చ చేస్తున్నారని పరోక్షంగా విపక్ష పార్టీలను ఉద్దేశించి జగన్ ఫైర్ అయ్యాడు.
సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నాడు.విగ్రహ కూల్చివెతలకు పాల్పడుతున్నవారికి కటినమైన శిక్షలు తప్పవని హెచ్చరించాడు.
.