పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు వీర లెవల్ లో ఉన్నాయి.
ఇంకా నార్త్ లో అయితే ప్రభాస్ సినిమాలకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అని కూడా సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని బజ్ క్రియేట్ చేసాయి.ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని సినీ క్రిటిక్స్ ఇప్పటికే ఒక అంచనాలు వచ్చేసారు.
అయితే తాజాగా ఈ సినిమాపై ఒక నమ్మలేని పుకారు ఒకటి సోషల్ మీడియాలో షికారు చేస్తుంది.ఈ వార్త అస్సలు నమ్మశక్యం కాకుండా ఉంది.
కానీ ఈ వార్త విన్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
రాధేశ్యామ్ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేస్తారు అనే వార్త నమ్మదగిన న్యూస్ కాకపోయినా ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది.అస్సలు ఈ ప్రచారం ఎందుకు వచ్చింది అన్న చర్చ కూడా నడుస్తుంది.ప్రసెంట్ దేశంలో మారుతున్నా పరిస్థితుల కారణంగా ఇలాంటి ప్రచారం వస్తుంది అని భావిస్తున్నారు.
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నార్త్ ఇండియాలో ఆంక్షలు పెరుగుతున్నాయి.
రాత్రి పూట కర్ఫ్యూలు పెట్టడమీ కాకుండా పగటి వేళలో కూడా కొత్త నిబంధనలు తెచ్చే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది.మరి పాన్ ఇండియా మూవీ అయినా రాధేశ్యామ్ సినిమాకు ఓమిక్రాన్ భయం పట్టుకుంది.ఆంక్షలు విధిస్తే కలెక్షన్లు మీద ప్రభావం చూపుతుంది.
రిలీజ్ సమయానికి మరిన్ని కేసులు పెరిగితే ఎలా అనే ప్రశ్న అందరిలో మొదలవుతుంది.మొత్తానికి ఈ సినిమా ఓటిటి కి వెళ్లనుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది.
ఎలా వచ్చిన కూడా ఈ న్యూస్ నిజం కాకుడదు అని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.