మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసులుగా ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.అల్లు శిరీష్ కూడా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు.
అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ కూడా గని సినిమా ద్వారా నిర్మాతగా మారారు.ఇక బాబి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్, అల్లు అరవింద్ హాజరయ్యారు.
ఇక ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు.అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా అల్లు పతాకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని అతడిపై ప్రశంసలు కురిపిస్తూ ఎమోషనల్ అయ్యారు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించారు.ఈ క్రమంలోనే వైజాగ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఇక గని సినిమా గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా ఇప్పటికే తాను చూశానని, ఎంతో అద్భుతంగా వచ్చిందని సినిమా పక్కా హిట్ అవుతుందని తెలిపారు.
ఇక ఈ వేడుకల్లో భాగంగా నిర్మాత అల్లు బాబీ గురించి మాట్లాడుతూ.తనకు సినిమా నాలెడ్జ్ చాలా బాగా ఉందని, నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఆయన తెరవెనక ఉన్నారు.అందరి బలవంతంగా తనని నిర్మాతను చేశామని, ఈ సినిమాతో నిర్మతగా నిరూపించుకుంటారని అల్లు అరవింద్ తెలిపారు.
ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటన ఎంతో అద్భుతంగా ఉంది.ఈ సినిమా కోసం వరుణ్ ఎంతో కష్టపడ్డారని తెలిపారు.వరుణ్ సరసన సాయి మజ్రేకర్ కథానాయికగా నటించగా, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు.