సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది.గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.
హిందీలో కూడా వసూళ్ల సునామీ సృష్టించింది.
సుకుమార్ డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, దేవి శ్రీ మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.
బాలీవుడ్ లో సైతం విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది.ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పార్ట్ 1 ఘన విజయంతో పార్ట్ 2 అంచనాలు అమాంతం పెరగడంతో సుకుమార్ స్క్రిప్ట్ కోసం చాలా సమయం తీసుకుంటున్నాడు సుకుమార్.
ఈ సమయంలో అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో కలిసి సమయం స్పెండ్ చేస్తున్నాడు.ఇటీవలే ఐకాన్ స్టార్ తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి విదేశాలకు వెళ్లి వచ్చాడు.ఇక మళ్ళీ ఇప్పుడు తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.
దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా ఒక ఫోటో వైరల్ అయ్యింది.
ఈ ఫొటోలో అల్లు అర్జున్ తన భార్య స్నేహ, పిల్లలు అర్హ, అయాన్ లతో కలిసి అడవిలో ఫోటో షూట్ చేసినట్టు తెలుస్తుంది.ఈయన ఫ్యామిలీతో కలిసి టాంజానియాలో స్పెషల్ ఫోటో షూట్ చేసారు.ఈ ఫొటో అందరిని బాగా ఆకట్టు కుంటుంది.రాబోయే రోజుల్లో పుష్ప పార్ట్ 2 స్టార్ట్ అయితే ఇక ఫ్యామిలీతో సమయం గడపడానికి ఉండదని ఇప్పుడు వీలైనంత ఎంజాయ్ చేస్తున్నాడు.